టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ హీరోయిన్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు ‘సీసీసీ’ ఛారిటీకి హీరోయిన్ల నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడమే ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముంబై నుంచి వచ్చిన ఎందరో హీరోయిన్లు ఇక్కడ పని చేస్తున్నారని… అయితే కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఛారిటీ కోసం ఎవరూ స్పందించడం లేదని బ్రహ్మాజీ మండిపడ్డాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమని అన్నారు. కేవలం లావణ్య త్రిపాఠి వంటి వారు మాత్రమే స్పందించారని ఆయన చెప్పారు.