HomeTelugu Big Storiesపునీత్‌ రాజ్‌ కుమార్‌కు టాలీవుడ్‌ ప్రముఖుల వీడ్కోలు

పునీత్‌ రాజ్‌ కుమార్‌కు టాలీవుడ్‌ ప్రముఖుల వీడ్కోలు

Tollywood Celebrities tribu

కర్ణాటక రాజధాని బెంగుళూరు కంఠీరవ స్టేడియానికి ఒక్క ఒక్కరు గా సినీ ప్రముఖులు చేరుకున్నారు. తాజాగా పునీత్‌ రాజ్ కుమార్‌ భౌతిక ఖాయాన్ని సందర్శించారు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్, ఎన్టీఆర్‌, రానా, శ్రీకాంత్‌, ఆలీ కూడా పునీత్‌ కు నివాళులు అర్పించారు.

కాగా.. కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం నేపథ్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్‌లో వెళ్లిన సంగతి తెలిసిందే. నటుడి అకాల మరణం లక్షలాది మంది అభిమానులు మరియు అభిమానుల హృదయాలను బద్దలు చేసింది.

ఈరోజు జరగాల్సిన అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. అమెరికా నుంచి కుటుంబ సభ్యుల రాక ఆలస్యం అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక పునీత్ సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు వినయ్ రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రయలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం బొమ్మై, ప్రభుదేవా, గవర్నర్ గెహ్లాట్ సహా ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!