వ్యాఖ్యాతగా, నటిగా పలు టీవీ షోల్లో, సినిమాల్లో నటించిన ఉదయభాను ఇటీవల సినిమా రంగానికి కాస్త దూరంగా ఉంటోంది. కొత్తగా ఇండస్ట్రీకు వచ్చిన యాంకర్స్ కారణంగా కూడా ఆమె యాంకరింగ్ కు బ్రేక్ ఇచ్చి కుటుంబంతో గడుపుతోంది. 12 ఏళ్ల క్రితం విజయకుమార్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన ఉదయభాను ఇటీవల ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.
ఇద్దరు ఆడపిల్లలు కావడం విశేషం. మొన్నమధ్య వారి ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. తాజాగా మరో ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇద్దరి పిల్లలకు యువి నక్షత్ర, భూమి ఆరాధ్య అనే పేర్లు పెట్టింది ఉదయభాను. తాను ఇప్పటివరకు గడిపిన జీవితం కంటే ఈ పిల్లలతో గడిపిన జీవితం చాలా సంతోషంగా అనిపిస్తోందని అంటోంది ఉదయభాను.