HomeTelugu Trendingఆ వ్యక్తితో నేను ప్రేమలో ఉన్నాను.. ట్వీట్‌ వైరల్‌

ఆ వ్యక్తితో నేను ప్రేమలో ఉన్నాను.. ట్వీట్‌ వైరల్‌

10 7
మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి అందరికి తెలుసు. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే ఆమె నిత్యం జరుగుతున్న సంఘటనల పైన ట్విట్టర్ వేదికగా స్పందిస్తారు. తన తాత గారి హాస్పిటల్స్ విషయాలోనే కాకుండా రామ్ చరణ్ తో పెళ్లి తర్వాత ఆవిడ సినిమా విషయాలోను స్పందిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టడానికి అలాగే దానికి దూరంగా ఉండటానికి అవసరమైన సలహాలు ప్రజలకు సూచనలు ఇస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ రోజు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో పోస్ట్ చేసారు ఉపాసన.

అందులో.. ఆవిడ ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక దానికి.. ”నన్ను నీను క్షమించుకుంటాను మరియు నాకు హాని కలిగించిన ఇతరులను నేను క్షమించాను. నేను కాబోతున్న వ్యక్తితో నేను ప్రేమలో ఉన్నాను” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్‌కి నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు. ఇతరులను క్షమించటానికి అందరికీ సెల్ఫ్ హీలింగ్ మరియు సెల్ఫ్ లవ్ అవసరమని కామెంట్స్ పెడుతున్నారు. కొందరు ‘మీకు దగ్గర వ్యక్తులతో ఏమైనా మనస్పర్థలు వచ్చాయా మేడమ్’ అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu