HomeTelugu Trendingపదేళ్ల సినీ ప్రయాణం.. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

పదేళ్ల సినీ ప్రయాణం.. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Varalakshmi Sarathkumar

సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వ‌ర‌ల‌క్ష్మీ. టాలీవుడ్‌లోనూ.. ఎన్నో వైవిధ్య క‌థ‌లను ఎంచుకుని త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన య‌శోద మూవీలో వ‌ర‌ల‌క్ష్మీ న‌టించారు. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నారు.

అయితే ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి నిన్న‌టికి ప‌దేళ్లు పూర్త‌యిన‌ సంద‌ర్భంగా.. వ‌ర‌ల‌క్ష్మీ భావోద్వేగంతో కూడిన పోస్టు పెట్టారు. ప‌దేండ్ల క్రితం ఇదే రోజు త‌న మొద‌టి సినిమా విడుద‌లైంద‌ని గుర్తు చేశారు. తాజాగా విడుద‌లైన య‌శోద చిత్రం ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ఈ ద‌శాబ్ద కాలం త‌న ప్ర‌యాణం సుల‌భంగా, అనుకున్న విధంగా సాగిందా అంటే.. కాద‌నే చెప్పాల‌న్నారు. ఈ ప‌దేండ్ల కాలంలో ఎన్నో తిర‌స్క‌ర‌ణ‌ల‌కు గుర‌వుతూనే.. ఎన్నో విలువైన విష‌యాల‌ను నేర్చుకున్నాని వ‌ర‌ల‌క్ష్మీ చెప్పుకొచ్చారు. 45 సినిమాల్లో న‌టించి నేనెంటో నిరూపించుకునే త‌న‌కు అవ‌కాశం ఇచ్చార‌న్నారు. అలాగే త‌న‌ను తిర‌స్క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్యావాలు తెలిపారు వ‌ర‌ల‌క్ష్మీ. తనకు మద్దతు ఇస్తూ కష్టకాలంలో అండగా నిలిచిన దర్శక నిర్మాతలకు, కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu