టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ చిత్రం రాబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఓ సినిమా కమిట్ అయిన త్రివిక్రమ్ ఈ చిత్రం తర్వాత వెంకీ-నానిలతో మల్టీస్టారర్ చిత్రం చేస్తారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ సిద్దం అవడంతో తరువాతి సినిమా గురించి కథా చర్చలు ప్రారంభించినట్లుతెలుస్తున్నాయి.
దీనిలో భాగంగా తనదైన శైలిలో ఫుల్ కామెడీ మూవీని ఇద్దరు హీరోలతో తెరకెక్కించాలని గురుజీ భావించారట. ఆ రెండు హీరోల పాత్రలు కామెడీ టైమింగ్ ఎక్కువగా ఉండే వెంకీ, నానిలు చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. తను అనుకున్న స్టోరీ లైన్ చెప్పడానికి త్వరలోనే వెంకీ, నానిలను త్రివిక్రమ్ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయని ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ హోం బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్తో పాటు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా ఇప్పటికే వెంకటేష్ .. మహేశ్ బాబు, రామ్, వరుణ్ తేజ్, నాగ చైతన్యలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాలు చేశారు.
ప్రస్తుతం వెంకీ నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఆ తరువాత ఎఫ్3, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. నాని చేతిలో కూడా రెండు మూడు చిత్రాలతో ఉన్నాయి. అయితే ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
..