HomeTelugu Trendingలోకల్‌ ట్రైన్‌లో అనన్య ఒడిలో పడుకున్న విజయ్‌

లోకల్‌ ట్రైన్‌లో అనన్య ఒడిలో పడుకున్న విజయ్‌

Vijay Devarakonda Ananya Pa

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ ‘లైగర్‌’. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు. చిత్రం బృందం ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో విజయ్, అనన్య పాల్గొన్నారు. వివిధ అంశాలపై ఈ ఇద్దరూ బోల్డ్ గా సమాధానాలు ఇచ్చారు.

అదే సమయంలో వివిధ ఈవెంట్లలో పాల్గొంటూ ‘లైగర్’ను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు హీరో విజయ్, హీరోయిన్ అనన్య. ఈ క్రమంలో ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు ఈ ఇద్దరూ ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయణించారు. ముంబైలో ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకునేందుకు వీరు ట్రైన్ ఎంచుకున్నారు. ట్రైన్ వచ్చే వరకూ రైల్వే స్టేషన్‌లో చాలా సేపు వేచి ఉన్నారు. ట్రైన్లో ఎక్కిన తర్వాత ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. విజయ్ కొద్దిసేపు అనన్య ఒడిలో పడుకొని కునుకు తీశాడు. ఈ ఫొటోలను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘లైగర్ ప్రమోషన్స్ ‘ట్రాక్’ లో ఉన్నాయి. లెట్స్ గో బాయ్స్’ అని పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu