HomeTelugu Trendingతిరుమల్లో టాలీవుడ్‌ ప్రముఖుల సందడి

తిరుమల్లో టాలీవుడ్‌ ప్రముఖుల సందడి

Tollywood celebrities visit

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాత బండ్ల గణేష్, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల ఆలయానికి వెళ్ళారు. అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఒకేసారి ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించడం విశేషం. అయితే అక్కడ ఉన్న భక్తులు వీరితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వీరికి సంబంధించి ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్‌ అవుతున్నాయి. ఉగాది పర్వదినానికి ముందు ప్రముఖులంతా పుణ్యక్షేత్రాల బాట పట్టడం గమనార్హం.

కాగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇటీవల విడుదలైన ‘పెళ్లి సందడి’ సినిమాకు పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడమే కాకుండా సినిమాలో మెరిశారు కూడా. ఇక సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ‘సేనాపతి’ అంటూ ఓటిటిలో, ‘సూపర్ మచ్చి’ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. ఇక ‘మహానటి’ సినిమాలో యువ సావిత్రి పాత్రను పోషించిన రాజేంద్ర ప్రసాద్ మనవరాలు తేజశ్విని కూడా తిరుమలలో కన్పించింది. మరోవైపు నిర్మాత బండ్ల గణేష్ తన కుటుంబ సభ్యులతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మంచు మనోజ్‌ కారుకు జరిమానా!

Recent Articles English

Gallery

Recent Articles Telugu