సహాజనటుడు నాని నిర్మాణంలో, ప్రశాంత్వర్మ దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్ మూవీ ‘అ’. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో ఈ చిత్రానికి మేకప్, వీఎఫ్ఎక్స్ విభాగాల్లో అవార్డులు లభించాయి. అయితే ఈ చిత్రానికి త్వరలో సీక్వెల్ తీయబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘అ’ సినిమాలోలాగా విభిన్న కథలు చూపించకుండా ఒకే కథ మీద ఈ సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు తెలిపారు. కాగా ఇందులో తమిళ నటుడు విజయ్సేతుపతి, నటి కాజల్ నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
‘అ!’లో కాజల్, నిత్యా మేనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస అవసరాల, మురళీ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది.