HomeTelugu Trendingమహేష్‌కు జంటగా కీర్తి సురేష్‌!

మహేష్‌కు జంటగా కీర్తి సురేష్‌!

15 6

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆయన 27వ సినిమా ఆయన ‘మహర్షి’ వంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. అయితే తరువాత అనూహ్యంగా మహేష్ వంశీ తో కాకుండా గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అని వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇంకా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ సినిమా మాత్రం పక్కా అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ప్రచారం లోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో సూపర్ స్టార్ కు జంటగా కీర్తి సురేష్ నటిస్తుందని అంటున్నారు. అయితే పరశురామ్ తన కథ పరంగా కీర్తి సురేష్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాడట. అయితే ఈ విషయం లో ఎంత నిజం ఉందొ మాత్రం తెలియదు. అయితే ప్తస్తుతం కరోనా కారణంగా అని సినిమా షూటింగ్ లు వాయిదా పడిన అందరికి తెలిసిన సంగతే. అయితే ఈ కారణంగా ఈ విషయానికి సంబంధించిన విషయం తెలియడానికి కొంచెం టైమ్‌ పడుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu