‘మార్క్ ఆంటోని’ విడుదల చేసేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. దీంతో ‘మార్క్ ఆంటోని విడుదలకు మార్గం సుగమనం అయింది’ అంటూ విశాల్ ట్వీట్ చేశాడు. సెప్టెంబర్ 15న మార్క్ ఆంటోని చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. విశాల్ మార్క్ ఆంటోని చిత్రంలో ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటించగా.. రీతూ వర్మ హీరోయిన్గా నటించింది. సునిల్, సెల్వ రాఘవన్, అభినయ, వై జి మహేంద్రన్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.
అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. ‘మార్క్ ఆంటోని’ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమా మీద హైప్ ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.