HomeTelugu Newsహైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో ఊడిపడిన పెచ్చులు.. మహిళ మృతి

హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో ఊడిపడిన పెచ్చులు.. మహిళ మృతి

10 16హైదరాబాద్‌ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర అపశృతి చోటు చేసుకుంది.. అమీర్‌పేట మెట్రో స్టేషన్ దగ్గర మహిళ మృతిచెందింది. అమీర్‌పేట మెట్రోస్టేషన్ పైనుంచి పెచ్చులు ఊడిపడి వివాహిత మౌనిక ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు కూకట్‌పల్లికి చెందిన మహిళగా గుర్తించారు. సాయంత్రం భారీ వర్షం కురుస్తున్న సమయంలో.. తన బైక్‌ను పక్కనే పార్క్ చేసి సారథి స్టూడియోస్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర కింద తన సోదరితో కలిసి నిల్చుంది మౌనిక.. అయితే, ఇదే సమయంలో పైనుంచి ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో తీవ్రగాయాలతో మౌనిక అక్కడికక్కడే చనిపోయింది. మౌనిక స్వస్థలం మంచిర్యాల.. నెలన్నర క్రితమే ఆమెకు వివాహమైంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!