HomeTelugu Newsఅజిత్‌ 'విశ్వాసం' తొలి షెడ్యూల్‌ పూర్తి

అజిత్‌ ‘విశ్వాసం’ తొలి షెడ్యూల్‌ పూర్తి

శివ దర్శకత్వంలో అజిత్‌ నటిస్తున్న నాలుగో చిత్రం ‘విశ్వాసం’. ‘వివేగం’ తర్వాత వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అజిత్‌, నయనతార, తంబిరామయ్య, రోబో శంకర్‌లకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలు, కథానాయకుడి పరిచయ గీతాన్ని ఇక్కడ చిత్రీకరించారు. దీంతో తొలి షెడ్యూల్‌ పూర్తయింది. చిత్ర బృందం కూడా చెన్నైతిరుగుముఖం పట్టింది. రెండో షెడ్యూల్‌ను చెన్నైలో నిర్వహించనున్నట్లు ప్రారంభంలోనే ప్రకటించారు. అయితే ఇప్పుడు ముంబయిలో తెరకెక్కించాలని చిత్రవర్గాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

5 9

అక్కడ 20 రోజుల పాటు చిత్రీకరణ జరగుతుందని తెలుస్తోంది. దీంతో చిత్ర బృందం త్వరలోనే ముంబయి వెళ్లనుంది. ఆ తర్వాతే మూడో షెడ్యూల్‌ను చెన్నైలో ప్రారంభించనున్నారు. దీపావళికి ఈ సినిమాను తెరపైకి తీసుకురావాలన్న లక్ష్యంతో వేగంగా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే నిర్మాణానంతర పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu