HomeTelugu Newsఓ పాటకు ఐదుగురు ప్రముఖ సింగర్లు

ఓ పాటకు ఐదుగురు ప్రముఖ సింగర్లు

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై బెల్లంకొండ శ్రీనివాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్‌గా రూపొందుతున్న సినిమా “సాక్ష్యం”. ఈ సినిమా శ్రీనివాస్ దర్శకత్వంతో భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాటను ఐదుగురు ప్రముఖ సింగర్లతో పాడించారు. పంచ భూతాల నేపథ్యంలో వచ్చే ఈ పాటను బాలు, జేసుదాసు, హరిహరన్, కైలాష్‌ఖేర్, బాంబేజయశ్రీలు పాడటం విశేషం.

4 13

జగపతిబాబు, శరత్ కుమార్‌, మీనా కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అభిషేక్ నామా నిర్మిస్తున్న సాక్ష్యం సినిమా జులై 20న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. ముందుగా జూన్ 14న విడుదల చేయాలనుకున్నా గ్రాఫిక్స్ పనుల ఆలస్యంతో వచ్చేనెలకు వాయిదా వేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu