ఇంజనీరింగ్ చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోఇంతవరకూ ఎక్కడా లేని విధంగా, ఇంజనీరింగ్ నిపుణులు సైతంనివ్వెరపోయేలా భూగర్భంలో ‘మేఘా’నీటి పంపింగ్ కేంద్రం నీటినిపంప్ చేయడం ప్రారంభించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నోఆవిష్కరణలు, పరిశోధనలు, నిర్మాణాలు ప్రపంచ గమనాన్ని వేగిరంచేయగా తెలంగాణాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భపంపింగ్ కేంద్రం వాటి సరసన చేరి పంపింగ్ కేంద్రాల నిర్మాణంలోఅగ్రభాగాన నిలబడింది. ఈ పంపింగ్ కేంద్రం వ్యవసాయ–ఇంజనీరింగ్ (ఎలక్ట్రోమెకానికల్) చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించిభవిష్యత్లో అన్నదాత నీటిసమస్యలు తీర్చే కొత్త మార్గాన్నిఆవిష్కరించింది. ఎంత లోతున నీరు వున్నా, ఎంత ఎత్తులోఅవసరమైనా వ్యవసాయం కోసం నీటిని పంప్ చేసే విధంగాపంపింగ్ కేంద్రాన్ని నిర్మించడం సుసాధ్యమని మేఘానిరూపించింది. అన్నింటా అరుదుగా నిలిచిపోయే లక్ష్మీపూర్(గాయత్రి) భూగర్భ పంపింగ్ కేంద్రంలోని 5వ పంపు నుంచి నీటిపంపింగ్ ఆదివారం రాత్రి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.సుమారు 3000 క్యూసెక్కుల నీరు 111 మీటర్ల ఎగువకు ఎగజిమ్మింది.ఉవ్వెత్తున లేచివచ్చిన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. ఆగష్టు14, బుధవారం నాడు 4,5 పంపులను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. దీనికిఅధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.
“తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకునేఅవకాశం మేఘా ఇంజినీరింగ్కు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రజల నీటి కలను తీర్చేందుకు ప్రపంచంలో అత్యుత్తమఇంజినీరంగ్ సంస్థలతో కలిసి పనిచేయడం, అత్యాధునికటెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం మాకు లభించినజీవిత కాలపు అవకాశంగానూ, గౌరవంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతీ అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లనేతక్కువ కాలంలో పూర్తి చేయడం సాధ్యమైంది. ” అని బి. శీనివాస్రెడ్డి అభిప్రాయపడ్డారు.
‘మేఘా మహాద్భుత సృష్టి
ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇంతకుముందు ఎక్కడా లేనిది.అందులోనూ భూగర్భంలోనిది. శక్తిరీత్యా, సామర్ధ్యాల ప్రకారం, నీటిపంపింగ్ లక్ష్యం, పరిమాణం… ఇలా ఏ ప్రకారం చూసుకున్నా అదొకఇంజనీరింగ్ కళాఖండం. మేఘా ఇంజనీరింగ్ తన సాంకేతిక శక్తిసామర్ధ్యాలతో నిర్మించిన మహాద్భుత సృష్టి. మానవనిర్మిత ప్రపంచఅద్భుతాల్లో ఇది ముందువరసలోకి చేరుతుంది. అదే కాళేశ్వరంపథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలక్ష్మీపూర్ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్(గాయత్రి) భూ గర్భ పంపింగ్ కేంద్రం. ప్రపంచంలో ఇంత పెద్ద నీటిపంపింగ్ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు. ఒక్కోమిషన్వారీగా చూస్తే సామర్ద్యం 139 మెగావాట్లు కావడంతోప్రపంచంలో ఇదే పెద్దది. ఇక మొత్తం పంపింగ్ కేంద్రం ప్రకారంచూసినా 973 మెగావాట్లు కూడా అతిపెద్దది. ఇందులోవినియోగించిన ఎలక్ట్రికల్ మోటార్ పంప్హౌస్ల్లోనే కాకుండామొత్తంగా ప్రపంచంలో ఏ రంగంలోనూ అంటే పరిశ్రమలు, విద్యుత్ఉత్పత్తి, మరే ఇతర రంగాల్లోనూ ఇంత పెద్దది లేదు. దీన్ని బట్టి ఈపంపింగ్ కేంద్రం మేఘా స్థాయి ఎంత గొప్పదో ఊహించుకుంటేనేవిస్తుపోక తప్పదు.
కాళేశ్వరం ప్రాజెక్ట్లో 2 టీఎంసీల పంపింగ్ కు గాను మొత్తం 4627 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం అవసరం కాగా ఎంఐఈఎల్ మాత్రమే 3057 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం కలిగిన పంపులనుఏర్పాటు చేస్తూ తన శక్తి సామర్థ్యాలు చాటుకుంది. సాగునీటిరంగంలో ఎత్తిపోతల పథకంలోని పంపులకు ఇంత పెద్ద స్థాయిలోవిద్యుత్ సామర్థ్యం వ్యవస్థను ఏర్పాటు చేయడం ఓ రికార్డ్. ప్రపంచంలో ఇంతకు ముందెన్నడు భారీ స్థాయిలో వ్యవస్థనుఏర్పాటు చేయలేదు.
మూడున్నరేళ్లలోనే…
అసలు ఎత్తిపోత పథకాలే ఇంత పెద్ద స్థాయిలో భారీ శక్తి సామర్ధ్యాతోభూ ఉపరితలంపై కూడా ఇప్పటికీ ఎక్కడా లేవు. అటువంటిదిఇక్కడ భూగర్భంలో ప్రపంచంలోనే పెద్దది నిర్మించడం అందులోనూరోజుకు కనీసం 2 టిఎంసీల నుంచి గరిష్టంగా 4.5 టిఎంసీలను 111.4 మీటర్ల ఎగువకు పంప్ చేయడం అనేది అసామాన్యమైనది. సవాళ్లను ఎదుర్కొని తన శక్తి సామర్ధ్యాలతో మేఘా ఇంజనీరింగ్ ఈపంపింగ్ కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చింది. అదీ కేవలంమూడున్నరేళ్లలోనే. సాధారణ పథకాల నిర్మాణాలు సైతం దశాబ్దాలసమయం పడుతున్న పరిస్థితుల్లో ఈ పథకంతోపాటు ఈ పంపింగ్కేంద్రాన్ని యుద్ధప్రాతిపదికన వేగంగా నిర్మించి రైతులకు అంకితంచేయడం మేఘా ఇంజనీరింగ్కే సాధ్యమైంది. ఈ పథకంలో ఎన్నోప్రత్యేకతలు, మరెన్నో విశిష్టతలు. ఆశ్చర్యగొలిపే విధంగా శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఇంజనీరింగ్కళాఖండాన్ని ఆవిష్కరింపచేసింది. రైతుల జీవితాల్లో కొత్తవెలుగులు నింపనుంది. వ్యవసాయ–ఇంజనీరింగ్ రంగంలోఅగ్రభాగాన