విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ సినిమా కూడా పైరసీ భారిన పడింది. సినిమాలోని కొంత భాగాన్ని కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు పైరసీ చేసినట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే గుంటూరు అర్బన్ పోలీసులు కొంత మంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 15న రిలీజ్కు రెడీ అవుతున్న గీత గోవిందం సినిమాలోని కొంత భాగాన్ని దొంగిలించి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నట్టుగా వార్తలు రావటంతో గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు.
అయితే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం ‘గీత గోవిందం’. కు పెద్ద షాక్ తగిలింది. కాగా తాజాగా ఈ సంఘటనపై హీరోగా విజయ్ దేవరకొండ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా క్లిప్స్ లీకైన విషయాన్ని ప్రస్తావించకుండా ‘నేను నిరాశకు గురయ్యాను, బాధపడుతున్నాను. ఒకసారి కొపమొస్తుంది. ఇంకోసారి ఏడుపొస్తోంది’ అంటూ ట్వీట్ చేశాడు విజయ్. దీంతో అర్జున్ రెడ్డి పైరసీని ఉద్దేశించే ఈ విధంగా ట్వీట్ చేశారని ఫ్యాన్స్ భావిస్తున్నారు