ఆగస్టు 22 (రేపు) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా మెగా టీమ్, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పలు కార్యక్రమాల్ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో బర్త్ డే సెలబ్రేషన్స్ ఆఫ్ మెగాస్టార్ పేరిట ఓ ఈవెంట్ జరపనున్నారు.
ఈ వేడుకల్లో రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్ లు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు హాజరుకానున్నారు. ఇకపోతే అభిమానుల కోసం పుట్టినరోజు కానుకగా ఈరోజు పదకొండున్నర గంటలకు చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ మూవీ టీజర్ ను విడుదల చేశారు. కాగా చిరంజీవి తన కెరీర్లో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేయడం ఇదే మొదటి సారి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ కొద్దిసేపట్టి క్రితమే విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాని రామ్ చరణ్ స్వయంగా నిర్మించారు.