HomeTelugu Newsబాబు అవినీతి నాలుగేళ్లుగా కనిపించలేదా?: లక్ష్మీపార్వతి

బాబు అవినీతి నాలుగేళ్లుగా కనిపించలేదా?: లక్ష్మీపార్వతి

ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు కలిసి డ్రామాలాడుతున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. బీజేపీ దగ్గర పక్కా ఆధారాలు ఉంటే చంద్రబాబు అవినీతిపై విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా బీజేపీ, పవన్‌ కల్యాణ్‌లకు చంద్రబాబు అవినీతి కనిపించలేదని, ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు అవినీతిలో బీజేపీ, పవన్‌లకు భాగస్వామ్యం లేదా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని దుయ్యబట్టారు. మూడు ముక్కలాట, మూడు స్తంభాలాట ఆడుతూ మోసం చేస్తున్నారని, ఈ విషయాన్ని గమనించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.

7 3

ఏపీ సీఎం చంద్రబాబు అండతో టీడీపీ నేతలు అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తూ, సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన బినామీలు కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని అన్నారు. ఇష్టారాజ్యంగా క్వారీ తవ్వకాలు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu