HomeTelugu News'మై డియర్ మార్తాండం' టీజర్‌ను రిలీజ్‌ చేయనున్న వైస్ జగన్

‘మై డియర్ మార్తాండం’ టీజర్‌ను రిలీజ్‌ చేయనున్న వైస్ జగన్

30 ఇయర్స్ ఇండస్ర్టీ అనే డైలాగ్‌తో మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ పృథ్వీరాజ్ హీరోగా మారాడు. వరుసగా మంచి సినిమాల్లో ప్రేక్షకులు మెచ్చే పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కమెడియన్ హీరోగా చేస్తున్న మరో చిత్రం ‘మై డియర్ మార్తాండం’. నూతన దర్శకుడు కేవీ హరీష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 30 రోజుల్లో లాయర్ అయ్యి.. కోర్టులో కేసులను గెలిపించడం ఎలా? అనే ఆసక్తికర కథతో రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా లాయర్ గెటప్ లో పృథ్వీ అలరించాడు.

8a

త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను ఏపీ ప్రతిపక్ష నేత వైస్ జగన్ చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మధ్యనే పృథ్వీ రాజ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు తెలిపి జగన్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలాగే ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్రలో కూడా పృథ్వీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తాను హీరోగా చేసిన సినిమా టీజర్ ను జగన్ చేత రిలీజ్ చేయించాలని ప్లాన్ చేశాడట పృథ్వీ. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముంది. మజిన్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu