HomeTelugu Newsరాజమౌళి ఆవిడను ఏమని పిలిచారు?

రాజమౌళి ఆవిడను ఏమని పిలిచారు?

తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని విశ్వమంతా చాటిచెప్పి ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన “బాహుబలి” చిత్రాన్ని అంత అందంగా మలిచిన జక్కన్న రాజమౌళి ఎన్ని అవార్డులు అందుకున్నారో తెలిసిందే. ఆ సినిమా కోసం రాజమౌళి ఎంత కష్ట పడ్డారో ఆయన సతీమణి రమా కూడా ఆయన వెన్నంటి ఉండి అంతే సహాయపడ్డారు. ఇటీవల బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌ మెడల్‌ అవార్డుల్లో రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా బంగారు పతకం అందుకున్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో రాజమౌళికి సంబంధించిన ఓ వీడియోను బిహైండ్‌వుడ్స్ సంస్థ విడుదల చేసింది. అందులో రాజమౌళి అవార్డు అందుకుంటున్న సమయంలో ఆయన సతీమణిని ఆహ్వానిస్తూ స్టేజ్ పైకి రావాల్సిందిగా హోస్ట్ కోరారు. అయితే తమిళ భాషలో ఆహ్వానం చెప్పడంతో రాజమౌళి సతీమణికి అర్ధం కాలేదు.

4 22

బాహుబలి సినిమాకు గానూ రాజమౌళి ఎన్ని అవార్డులు అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌ మెడల్‌ అవార్డుల్లో రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా బంగారు పతాకం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను బిహైండ్‌వుడ్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసింది. అదేంటంటే.. రాజమౌళి మెడల్‌ అందుకుంటున్న సందర్భంగా కార్యక్రమాన్ని హోస్ట్‌ చేస్తున్న వ్యాఖ్యాతలు రమాను కూడా స్టేజ్‌పైకి ఆహ్వానించారు. ఆ సమయంలో వెంటనే రాజమౌళి మైక్‌ అందుకుని “చిన్నీ.. స్టేజ్‌పైకి రమ్మంటున్నారు” అని ప్రేమగా పిలిచారు. అప్పుడు రమ లేచి స్టేజ్‌పైకి వెళుతుండగా అక్కడే ఉన్న అనుష్క.. రమా, రాజమౌళిల ఫొటోలు తీశారు. ఈ అపురూపమైన దృశ్యాన్ని బిహైండ్‌వుడ్స్‌ విడుదల చేసినందుకు “జక్కన్న” అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu