HomeTelugu Newsవినాయక చవితి కానుకగా సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే'

వినాయక చవితి కానుకగా సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’

యంగ్‌ హీరో సుధీర్ బాబు హీరోగా గత నెలలో ‘సమ్మోహనం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే సుధీర్‌ బాబు చేసిన మరో సినిమా ‘నన్ను దోచుకుందువటే’. ఈ చిత్రాన్ని సుధీర్ బాబు తన సొంత బ్యానర్ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పై నిర్మించారు. నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. నాబా నటేష్ హీరోయిన్ గా నటించింది.

6 16

ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు ఇవాళే చిత్రబృందం ప్రకటించింది. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు ఆటిట్యూడ్ కలిగిన మేనేజర్ గా కనిపిస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన టీజర్ లో యువతకు నచ్చే అంశాలతో పాటు కొత్త దనం ఉండటంతో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా పాటలను విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu