HomeTelugu News'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' తో లక్ష్మీరాయ్‌

‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ తో లక్ష్మీరాయ్‌

చిరంజీవి 150వ చిత్రంలో ‘రత్తాలు రత్తాలు’ పాటతో యూత్‌ను ఉర్రూతలూగించిన లక్ష్మీరాయ్‌ చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు సినిమాకు సైన్‌ చేసింది. బాలీవుడ్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేసినప్పటికీ.. ఆ చిత్రం ఆశించినంతగా విజయం సాధించలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న రాయ్‌లక్ష్మీ ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ చిత్రంతో కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పూర్తిగా విలేజ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

6 7

కాగా పూజిత పొన్నాడ ప్రత్యేక పాత్రలో నటించనుంది. హరి గౌర ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’కి సంగీతం అందిస్తున్నాడు. తాటవర్తి కిరణ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. దసరా సీజన్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ చిత్రాన్ని ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి.. ఏబిటి క్రియేషన్స్ సంస్థపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu