HomeTelugu Newsభారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1035 కేసులు, 40 మంది మృతి

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1035 కేసులు, 40 మంది మృతి

12 8
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలు ఉంది. మరో వైపు క్రమంగా కొత్త కేసులు పెరుగుతూనే వున్నాయి.. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 1035 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 40 మంది మృతి చెందినట్టు తెలిపారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,447కు చేరింది. మరో వైపు కరోనా బారిన పడి ఇప్పటి వరకు 642 మంది కోలుకున్నారు. ఇక మృతి చెందినవారి సంఖ్య 239కి చేరింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు మొత్తం 7529 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 652 మంది కోలుకోగా.. 242 మంది మృతి చెందారు. ప్రస్తుతం 6634 ఆక్టివ్ కేసులు వున్నాయి

Recent Articles English

Gallery

Recent Articles Telugu