కరోనా వైరస్ ప్రభావం దేశంలో అంతకంతకు పెరుగుతుంది. అయితే ఈ వైరస్ ను ఓడించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి లో ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ పోరాటం లో ప్రభుత్వాలకు సహాయం చేయడానికి భారత క్రికెటర్లు, సెలబ్రెటీలు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. తాజాగా ఇళయదళపతి విజయ్ ముందుకు వచ్చాడు. కరోనా పై పోరాటానికి కోటి 30 లక్షల విరాళం అందిస్తున్నట్లు అనౌన్స్ చేసాడు విజయ్.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 5 లక్షలు ఇచ్చిన విజయ్.. కర్ణాటక, పాండిచ్చేరి ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షలు.. కేరళ ప్రభుత్వానికి 10 లక్షలు.. దక్షిణాది సినీ కార్మికుల ఫెడరేషన్కు(ఫెఫ్సీ) 25 లక్షలు.. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు.. ప్రధాన మంత్రి సహాయ నిధికి 25 లక్షలు అనౌన్స్ చేశాడు .