HomeTelugu Newsతెలంగాణలో కరోనాతో 105 మంది మృతి

తెలంగాణలో కరోనాతో 105 మంది మృతి

9 3

తెలంగాణలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 105 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 127 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 110 మంది హైదరాబాద్‌కు చెందిన వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3147కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతిచెందారు. కరోనాతో కోలుకుని ఇప్పటి వరకు 1587 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 1455 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. తెలంగాణలోని కరోనా బాధితుల్లో రాష్ట్రానికి చెందిన వారు 2,699 మంది కాగా, 448 మంది వలస కార్మికులతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu