వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 248వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం యలమంచిలి నియోజకవర్గంలోని కొండకర్ల క్రాస్ నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి కొండకర్ల జంక్షన్, హరిపాలెం జంక్షన్, తిమ్మరాజు పేట, పెద్దపాడు క్రాస్ మీదుగా మునగపాక రోడ్డు (బ్రిక్ యూనిట్) వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ రోజు రాత్రికి జగన్ అక్కడే బస చేస్తారు. కాగా, వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ పాదయాత్ర సాగిస్తున్నారు. నేనున్నానంటూ వారికి భరోసానిస్తున్నారు. ఇప్పటివరకు వైఎస్ జగన్ 2826.9 కిలోమీటర్లు నడిచారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది.