HomeTelugu Newsభారత్‌లో 24 గంటల్లో 905 కరోనా కేసులు, 51 మరణలు

భారత్‌లో 24 గంటల్లో 905 కరోనా కేసులు, 51 మరణలు

9 12

కరోనా వైరస్‌ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో (సోమవారం సాయంత్రం 5 వరకు) కొత్తగా 905 కేసులు నమోదు అయ్యాయని, 51 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 324కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 9,352కు చేరిందని తెలిపింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 8048 మంది చికిత్స పొందుతుండగా.. 979 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది.

దేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే దాదాపు 2 వేల మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 563కి చేరింది. అటు ఏపీలోనూ 432 కేసులు నమోదయ్యాయి. మరోవైపు మరోసారి లాక్‌డౌన్‌ విధించేందుకు కేంద్రం సిద్ధమైంది. రేపు ఉదయం ప్రధాని మోడీ లాక్‌డౌన్‌కు సంబంధించిన ప్రకటన చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu