HomeTelugu Big Storiesసుశాంత్ ప్రియురాలిపై కేసు నమోదు

సుశాంత్ ప్రియురాలిపై కేసు నమోదు

Case filed on Sushant Girl
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. రియాచక్రవర్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి 6 పేజీల లేఖను పోలీసులకు అందచేశారు. గతేడాది వరకు సుశాంత్‌కు ఎలాంటి మానసిక ఒత్తిళ్లు లేవని తెలిపారు. ఒకవేళ ఆ తర్వాత డిప్రెషన్‌కు గురైనట్లయితే వాటికి గల కారణాలను దర్యాప్తు చేయాలని సుశాంత్ తండ్రి కేకే సింగ్ పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. సుశాంత్ సింగ్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 15 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు.

సుశాంత్ ఆర్థిక అంశాలతో పాటు ఇతర అంశాలను రియా పర్యవేక్షించినట్లు కేకే సింగ్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో రియా చక్రవర్తిని ముంబై పోలీసులు ప్రశ్నించనున్నారు. సుశాంత్‌కు చెందిన క్రెడిట్ కార్డులను దుర్వినియోగం చేసి భారీగా డబ్బును కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. సుశాంత్‌కు సంబంధంలేని వ్యక్తుల ఖాతాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్ అయినట్లు తన ఫిర్యాదులో తెలిపినట్టు సమాచారం. ఆర్థిక సమస్యలు కూడా తన కుమారుడి డిప్రెషన్‌కు కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్ ఆత్మహత్యకు ముందు సిమ్‌ కార్డులను తరచూ రియా మార్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu