HomeTelugu Newsఅలాంటి సీన్లకు దూరంగా ఉంటానంటున్న లావణ్య త్రిపాఠి

అలాంటి సీన్లకు దూరంగా ఉంటానంటున్న లావణ్య త్రిపాఠి

8 24

కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. షూటింగ్ లు నిలిచిపోవడంతో సెలబ్రిటీలు ఎవరూ బయటకు రావడం లేదు. ఎవరికి వారు ఇంట్లోనే ఉండిపోయారు. సినీ తారలు మాత్రం ఇంట్లోనే యూట్యూబ్ ఛానల్స్ లో వంటా వార్పు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం చాలా వరకు లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో త్వరలో సినిమా షూటింగులు కూడా మొదలు కాబోతున్నాయి.

తక్కువ మందితో షూటింగ్ జరుపుకునే అవకాశం ఇవ్వొచ్చు. ప్రస్తుతం సినిమాల్లో ముద్దు సీన్లు కామన్ అయ్యాయి. ఇవి లేకుంటే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి. కానీ ఇకపై రాబోయే సినిమాల్లో ఇలాంటి ముద్దు సీన్లు ఉండకపోవచ్చు. ఎందుకంటే కరోనా కారణంగా ఇలాంటి సీన్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. దీనిపై టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ముందుగానే నిర్ణయం తీసుకుందట. లాక్‌డౌన్ తర్వాత ముద్దు సీన్లలో నటించనని ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి అంటోంది. ప్రసుత్తం లావణ్య చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఏ1 ఎక్స్ ప్రెస్, ‘చావు కబురు చల్లగా’ సినిమాల్లో లావణ్య నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu