HomeTelugu Newsరెండు లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్

రెండు లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్

Actress renu desai sells he

నటి రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా పలు అంశాలను పంచుకుంటారు. తాజాగా రేణు మ‌రో చ‌క్క‌టి సందేశంతో వార్త‌ల్లో నిలిచారు. మారిషస్ లో చమురు లీకేజీ వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేస్తూ.. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అందులో భాగంగా ముందు తానే తన లగ్జరీ కార్లు అయిన ఆడి ఏ6 మరియు పోర్ష్ బాక్స్టెర్ ను అమ్మి కొత్త ఎలెక్ట్రిక్ కారును కొనుకున్నట్లు వెల్లడించారు. దీనికి అంతటికి ప్రధాన కారణం తన వంతుగా తాను పర్యావరణంలో కార్బన్ ను తగ్గించడమే అని ఆమె తెలిపారు. తాను చదివిన ఓ కథనం ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. కాగా రేణు దేశాయ్ విజ్ఞ‌ప్తి మేర‌కు చాలా మంది నెటిజ‌న్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. కాగా రేణు సినిమాల్లో పెద్దగా నటించకపోయినా.. బుల్లి తెరమీద కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu