HomeTelugu Trendingసెన్సార్ పూర్తి చేసుకున్న 'మేజర్'

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మేజర్’

Adivi seshs major complete
అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘మేజర్’. అడివి శేష్ ఇందులో మేజర్ సందీప్ గా నటించాడు. ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ‘మేజర్’ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ వెల్లడించింది.

శశికిరణ్ తిక్క డైరెక్షన్‌ వహించిన ఈ చిత్రంలో అడివి శేష్ తో పాటు సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాళ, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమా నిర్మాణంలో మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్లు పాలుపంచుకున్నాయి. ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu