HomeTelugu Trendingయదాద్రి ఆలయంలో 'అఖండ' మూవీ యూనిట్‌

యదాద్రి ఆలయంలో ‘అఖండ’ మూవీ యూనిట్‌

balakrishna 1

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ‘అఖండ’ మూవీ యూనిట్‌ సోమవారం ఉదయం దర్శించుకుంది. ‘అఖండ’ ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విజయోత్సవ యాత్రలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా టీమ్‌ యాదాద్రి ఆలయానికి చేరుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుంది.

balakrishna 2

అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ‘అఖండ’ విజయవంతమైన సందర్భంగా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నాం. భారతదేశంలోని ప్రతిఒక్కరూ స్వామివారిని దర్శించుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకశ్రద్ధ తీసుకుని ఈ ఆలయ పునఃనిర్మాణం చేపట్టారు. యాదాద్రి ఆలయం ఒక చరిత్రాత్మకం. ఆలయ నిర్మాణంలో పనిచేసిన ప్రతీ ఒక్క కార్మికునికి కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నా. ఆయన నా ఇష్ట దైవం. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ఆ భగవంతుడు కాపాడాలని కోరుకున్నా’ అని బాలయ్య తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu