బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరు అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, 2 స్టేట్స్, రాజీ వంటి హిట్స్ అందుకున్న అలియా.. బాలీవుడ్ టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా మారిపోయింది. హీరోయిన్ గా, మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్స్ చేసిన అలియా.. మొదటిసారి కొత్తగా విలన్ అవతారంలో కనిపించబోతున్నది.
2008 లో వచ్చిన కరణ్ కామెడీ ఎంటర్టైనర్ దోస్తానా. ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం, అభిషేక బచ్చన్ లు నటించిన ఈ సినిమా సూపర్ హిట్టైంది. దాదాపు 11 సంవత్సరాల తరువాత దోస్తానా 2 సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్స్ పూర్తయినట్టు వినికిడి. ఇందులో అలియా భట్ విలన్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో నటించే మిగతా నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారట.