HomeTelugu Big Storiesఈడీ విచారణకు హాజరైన లైగర్‌ బ్యూటీ

ఈడీ విచారణకు హాజరైన లైగర్‌ బ్యూటీ

Ananya panday arrives at nc

బాలీవుడ్‌ను డ్రగ్స్‌ కేసు కుదిపేస్తుంది. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్‌ అనన్య పాండే ఎన్సీబీ ఎదుట హాజరయ్యింది.

తండ్రి, నటుడు చంకీ పాండేతో కలిసి ఆమె ఎన్సీబీ కార్యాలయానికి చేరుకుంది. ఈరోజు ఉదయం అనన్య ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు ఆమె ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను సీజ్‌ చేశారు. ఈనెల 2న జరిగిన క్రూయిజ్‌ రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ కావాలని ఆర్యన్‌. అనన్యకు వాట్సప్‌ చాట్‌ చేసినట్లు సమాచారం.

అంతేకాకుండా ఈ చాట్‌లో లైగర్‌ భామ అనన్యతో పాటు ఆర్యన్‌ సోదరి సుహానా ఖాన్‌ కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా స్టార్‌ హీరోల పిల్లలు కావడంతో అందరికి ఓ కామన్‌ వాట్సాప్‌ గ్రూప్‌ ఉన్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu