పూరీ జగన్నాథ్- విజయ్ దేవర కొండ కాంబినేష్లో వస్తున్న సినిమా ఫైటర్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తి కాకుండానే ఈ అమ్మడు మరో గోల్డెన్ ఆఫర్ కొట్టేసినట్టు ఫిలింనగర్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు పరశురామ్ డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ గా అనన్య పాండే పేరును పరిశీలిస్తున్నారట. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.