HomeTelugu Trendingమళ్లీ ఎవరినో టార్గెట్ చేస్తూ అనసూయ ట్వీట్

మళ్లీ ఎవరినో టార్గెట్ చేస్తూ అనసూయ ట్వీట్

Anchor Anasuya
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ అనసూయ. ఆమె చేసే ప్రతి ట్వీట్ ఒక సంచలనమే! ప్రస్తుతం అనసూయ చేసిన తాజా కామెంట్ నెట్టింట రచ్చ రేపుతోంది.

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో కొన్నేళ్ల పాటు కొనసాగిన వివాదానికి ఇటీవలే ఫుల్‌స్టాప్ పెట్టింది. మళ్లీ ఏమైందో తాజా ట్వీట్‌తో అనసూయ కొందరిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా పోస్ట్ పెట్టడంపై నెట్టింట్లో చర్చ జరుగుతోంది.

ఫ్యామిలీతో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న అనసూయ తాజాగా కొన్ని హాట్ ఫొటోస్ షేర్ చేసిన విషయం తెలిసిందే. తాజా ట్వీట్‌లో.. వావ్! నేను నిజంగా చాలా ఇంపార్టెంట్ వ్యక్తినే. నా ప్రమేయం ఉన్నా లేకున్నా నాకు సంబంధం ఉన్నా లేకున్నా నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగదంటే మీ అందరికీ ఎంత కావలసిన వ్యక్తినో కదా.. నాపై అంతగా డిపెండ్ అయి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేక పోతున్నారు’ అంటూ ట్వీట్ చేసింది.

అనసూయ ఎవరిని ఉద్దేశించి ఈ పరోక్ష వ్యాఖ్యలు చేసిందో అర్థంకాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. అనసూయ గతంలో చేసిన పలు ట్వీట్లు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

అనసూయ ట్వీట్ చూసిన నెటిజన్లు మళ్లీ ఏమైందంటూ కామెంట్లు చేస్తున్నారు. అవేం పట్టించుకోవద్దు మేడమ్. వాళ్లు ఎప్పటికీ మారరు. వాళ్ల పాపాన వాళ్లే పోతారని తనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కొందరు మాత్రం మళ్లీ ఏమైంది ఆంటీ అని తనకు కోపం వచ్చేలా పోస్టులు పెడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu