HomeTelugu Trendingయాంకర్ రష్మి కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం!

యాంకర్ రష్మి కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం!

4 17బుల్లితెర హాట్ యాంకర్, హీరోయిన్ రష్మి కారు ప్రమాదం ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో రష్మి ప్రయాణిస్తున్న కారు రోడ్డు క్రాస్ చేస్తున్న పాదచారిని ఢీకొట్టిడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని మొదట దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా మారడంతో విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుడు చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన లారీ డ్రైవర్‌ సయ్యద్‌ అబ్దుల్‌గా గుర్తించారు.

అయితే ప్రమాదం జరిగే సమయానికి రష్మి తన తల్లితో సహా కారులోనే ఉందని.. యాక్సిడెంట్ తరువాత ఆమె ప్రమాద స్థలం నుండి మరో కారులో వెళ్లిపోయినట్టు తెలిస్తోంది. అయితే ఈ యాక్సిడెంట్ చేసింది రష్మినా? లేక ఆమె డ్రైవర్ కారు నడుపుతున్నారా అన్న విషయం తేలాల్సి ఉంది. TS11 EE 1789 నంబర్ గల ఈ కారుపై ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణపై ఆరుకి పైగా చలానాలు ఉండటం విశేషం. 2015 డిసెంబర్ నుండి ఫిబ్రవరి 2019 వరకూ రాంగ్ పార్కింగ్, జీబ్రా క్రాసింగ్ జంప్ తదితర అతిక్రమణల కింద రూ. 800పైగా ఫైన్ ఉంది. కాగా ఇదే కారు విశాఖలో ఓ వ్యక్తిని ఢీకొట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ కేసులో రష్మి కారు డైవర్ ఎం.ఎ గౌతమ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై రష్మి ఇంకా స్పందించలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu