HomeTelugu News'మహర్షి'లో మరో నటి‌!

‘మహర్షి’లో మరో నటి‌!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లితో కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘మహర్షి’. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఈమె మాత్రమే కాకుండా మరొక హీరోయిన్ ‘మీనాక్షి దీక్షిత్‌’ కూడ నటిస్తోంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈమె ‘మహర్షి’ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే అమెరికాలో తన పాత్ర తాలూకు షూటింగ్ కూడ పూర్తి చేసిందామె. దిల్ రాజు, అశ్విని దత్, పివిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu