HomeTelugu Trendingసుశాంత్ కుటుంబంలో మరో విషాదం

సుశాంత్ కుటుంబంలో మరో విషాదం

2 15
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త యావత్ సినీ పరిశ్రమను కలచివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ మరణ వార్త విని ఆయన దగ్గర బంధువు ఒకరు చనిపోయారు. సుశాంత్ మరణవార్త తెలియగానే తీవ్ర మనోవేదనకు గురై బీహార్‌లో ఉంటున్న సుశాంత్ కజిన్ అంబ్రేంద్ర సింగ్ భార్య సుధా దేవి కుప్పకూలిపోయారు. నిద్రాహారాలు మాని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా బాధపడుతూ సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న రోజే ప్రాణాలు విడిచింది. ఆమె ఎంతో ఆప్యాయంగా చూసుకునే సుశాంత్ మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడంతోనే చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని మహారాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. వృత్తిపరంగా పోటీతట్టుకోలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయినట్లు మీడియాలో కథనాలు వస్తున్నందున ముంబై పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తారని వెల్లడించారు. ఈ కేసులో సుశాంత్ మాజీ ప్రియురాలిని మరియు అతడి స్నేహితులను పోలీసులు ఇప్పటికే విచారణ చేసినట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu