స్టార్ హీరోయిన్ల్లో అనుష్క ఒకరు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో సినిమా చేస్తుంది. ఈ సినిమాకు నిశ్శబ్దం అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమా త్వరలో విడుదల కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క తో పాటు మాధవన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క ఎవరితో సినిమా చేస్తుందని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
కాగా తాజా సమాచారం ప్రకారం అనుష్క క్లాస్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో సినిమా చేస్తున్నది తెలుస్తుంది. ఇప్పటికే కథను కూడా సిద్దం చేసారని త్వరలో స్క్రిప్ట్ ఫైనల్ అవుతుందని తెలుస్తుంది. గౌతమ్ మీనన్ తో పాటు మరో ఇద్దరు దర్శకులు కూడా అనుష్కతో సినిమా చేయడానికి సిద్దమౌతున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా నిశ్శబ్దం చిత్రం వాయిదా పడుతుందా, లేదంటే అనుకున్న సమయానికే విడుదల అవుతుందా చూడాలి.