అభినవ్ సర్దార్ పటేల్, రామ్ కార్తీక్, చాందిని, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పీనట్ డైమండ్’. ఈ సినిమాకి త్రిపర్న వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు క్రిష్ సోమవారం ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. యాక్షన్ సన్నివేశాలతో ఆసక్తిగా సాగింది. సీనియర్ నటులు సుమన్, శుభలేఖ సుధాకర్ పాత్రలు కీలకంగా నిలిచాయి. ‘వజ్రాన్ని తయారు చేయాలనే ఆలోచన వాడికి ఆరోజే మొదలైంది’ అనే సంభాషణతో ట్రైలర్ ముగుస్తుంది. మరి ఆ వజ్రం తయారుచేయాలనుకుంది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అభినవ్ సర్దార్, త్రిపర్న వెంకటేశ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.