HomeTelugu Newsఏపీలో 2282కి పెరిగిన కరోనా కేసులు

ఏపీలో 2282కి పెరిగిన కరోనా కేసులు

7 17
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఇవాళ 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 2282కి చేరింది. గత 24 గంటల్లో 9,713 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 52 పాజిటివ్ కేసులు బయటపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో చిత్తూరులో 12, నెల్లూరులో 7 కేసులు కోయంబేడు మార్కెట్‌ లింకులుగా అధికారులు తెలిపారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1527 మంది డిశ్చార్జి కాగా, 705 మంది చికిత్సపొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో కరోనాతో 50 మంది మృతిచెందారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu