టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్పై దర్శకుడు రామ్గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. హీరోయిన్ల కంటే కేసీఆరే అందంగా ఉంటారని ఇప్పటిదాకా తాను నమ్మేవాడినని.. కానీ, తాజా ఫలితాలు చూస్తే ఆయన సినీ హీరోల కంటే అందగాడిగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. హిమాలయాల కంటే కూడా కేసీఆరే ఆకర్షణీయంగా కనిపిస్తున్నారని ట్వీట్ చేశారు. పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఘాటు విమర్శలు గుప్పించారు. మహాకూటమిని కేసీఆర్ మట్టికరిపించినట్లుగా ట్విటర్లో ట్రెండ్ అవుతున్న ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. ప్రధాని మోడీ గుజరాత్లో అత్యంత ఎత్తైన విగ్రహం పెట్టారని.. ఇక తెలంగాణ ప్రజలు దానికి 2.0 రెట్ల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాంగోపాల్ వర్మ అన్నారు.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ స్పూఫ్ వీడియోను కేటీఆర్కు ట్యాగ్ చేస్తూ పోస్టు చేసిన వర్మ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కేటీఆర్.. మీ నాన్న కేసీఆర్.. 2.0 మాత్రమే కాదు.. రజినీకాంత్ కంటే 20 రెట్లు, మహేశ్ బాబు కంటే 200 రెట్లు ఎక్కువ. ఇక చంద్రబాబు నాయుడు కంటే 2000 రెట్లు ఎక్కువ’ అని రాసుకొచ్చారు. దీనికి కేటీఆర్ కూడా స్పందించారు. ఈ విషయం నాకెప్పుడో తెలుసునని బదులిచ్చారు.
Hey @KTRTRS ,ur father KCR is not 2.0 but he is 20.0 times @rajinikanth 200.0 times @urstrulyMahesh and 2000.0 times bigger than @ncbn pic.twitter.com/D7YWWLDhlz
— Ram Gopal Varma (@RGVzoomin) December 11, 2018