ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె స్వప్న దత్ మాట్లాడుతూ… ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తమ ప్రేమ పెళ్లి జరగడానికి జూనియర్ ఎన్టీఆరే కారణమని అన్నారు. ఇటీవల ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తారక్ వల్లే తన పెళ్లి జరిగిందని చెప్పంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నా వివాహం జరగడానికి జూనియర్ ఎన్టీఆరే కారణం. పెళ్లికి ముందు తన భర్త ప్రసాద్ వర్మ, తాను కొంతకాలం ప్రేమించుకున్నాం. అయితే ఈ విషయాన్ని మా నాన్నకు(వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీదత్) చెప్పేంత ధైర్యం లేదు. ఎందుకంటే నాన్న నా ప్రేమను కచ్చితంగా నిరాకరిస్తారని తెలుసు. అయితే ఈ విషయాన్ని నేను శక్తి మూవీ షూటింగ్ సమయంలో తారక్తో పంచుకున్నా. తను వెంటనే ఇంట్లో చెప్పమని సలహా ఇచ్చాడు.
‘ఇలాంటి విషయాల్లో అసలు ఆలస్యం చేయకూడదు. మీ నాన్నగారితో నేను మాట్లాడుతా’ అని చెప్పి షూటింగ్ అయిపోయాక మా ఇంటికి వచ్చి నాన్నతో నా ప్రేమ విషయం చెప్పాడు. మొదట ఆయన కాస్తా సీరియస్ అయినా ఆ తర్వాత తారక్ తన మాటలతో నాన్నను ఒప్పించాడు. అలా మా పెళ్లికి తారక్ మూలకారణం అయ్యాడు’ అని ఆమె చెప్పుకొచ్చింది. కాగా స్వప్నా దత్ ప్రసాద్ వర్మను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి 2010లో జరిగింది. తండ్రి అనంతరం ప్రస్తుతం వైజయంత్ బ్యానన్ వ్యవహారాలు, బాధ్యతలను స్వప్నాదత్ ఆమె సోదరి ప్రియాంక దత్లు చూసుకుంటున్న సంగతి తెలిసిందే.