HomeTelugu Newsప్రణబ్ ముఖర్జీకి భారత రత్న

ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న

7 21

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న వరించింది. అలాగే ఆరెస్సెస్ నేత నానాజీ దేశ్ ముఖ్, ప్రముఖ గాయకుడు భూపెన్ హజారికాలకు మరణానంతరం భారత రత్నను ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు 40 మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం లభించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారానికి ప్రణబ్ ముఖర్జీ సంపూర్ణ అర్హుడని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచడానికి, రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రణబ్ ముఖర్జీ దేశానికి ఎనలేని సేవలు చేశారని కేసీఆర్ కొనియాడారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!