HomeTelugu Trendingబిగ్‌బాస్‌పై కౌశల్‌ స్పందన

బిగ్‌బాస్‌పై కౌశల్‌ స్పందన

2 17

బాస్‌పై వస్తున్న ఆరోపణలపై సీజన్‌ 2 విజేత కౌశల్‌ మండ స్పందించారు. ఈ కార్యక్రమం అనైతికంగా ఉందని అడ్డుకోవాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడు అభిషేక్‌ ముఖర్జీపై సినీ నటి గాయత్రి గుప్తా ఫిర్యాదు చేశారు. దాంతో త్వరలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కౌశల్‌ బిగ్‌బాస్‌ గురించి ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘బిగ్‌బాస్‌ 2 విజేతగా, ఓ సామాన్య పౌరుడిగా నాకు ఈ కార్యక్రమంపై ఎంతో గౌరవం ఉంది. ఈ కార్యక్రమం, ఎంపిక చేసే ప్రక్రియ ఎంతో నిజాయతీగా ఉంటాయని నాకు తెలుసు. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొనబోయే వారందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. మీరు రైడ్‌ ఎక్కబోతున్నారు’ అని పేర్కొన్నారు. మూడో సీజన్‌కు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నాని వ్యాఖ్యతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ షో వివాదంపై డీఐ విజయ్‌ కుమార్‌ దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!