HomeTelugu Trendingస్పృహలోకి వచ్చిన బాలీవుడ్‌ హాస్య నటుడు

స్పృహలోకి వచ్చిన బాలీవుడ్‌ హాస్య నటుడు

Bollywood Comedian raju sri

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ 15 రోజులు తరువాత ఈ రోజు (గురువారం) ఉదయం స్పృహలోకి వచ్చారు. ఆయన ఆరోగ్యంపై వ్యక్తిగత కార్యదర్శి గర్విత్ నారంగ్ ప్రకటన చేశారు. 58 ఏళ్ల రాజు శ్రీవాస్తవ తీవ్ర గుండెపోటుతో ఈ నెల 10న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరడం తెలిసిందే.

అప్పటి నుంచి వైద్యులు ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి మెరుగుపడుతోందని, వైద్యులు పర్యవేక్షిస్తున్నట్టు నారంగ్ తెలిపారు. జిమ్ లో కసరత్తులు చేస్తున్న సమయంలో కుప్పకూలిపోయిన రాజు శ్రీవాస్తవను శిక్షకుడే ఎయిమ్స్ కు తరలించడం తెలిసిందే. చికిత్సలో భాగంగా ఆయన ఆరోగ్యంలో ఎన్నో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. రాజు శ్రీవాస్తవ స్పృహలోకి వచ్చినట్టు ఆయన వ్యక్తిగత సలహాదారు అయిన అజిత్ సక్సేనా సైతం ధ్రువీకరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu