HomeTelugu TrendingThe kerala Story: విడుదలైన 9 నెలలకి ఓటీటీలోకి ది కేరళ స్టోరీ

The kerala Story: విడుదలైన 9 నెలలకి ఓటీటీలోకి ది కేరళ స్టోరీ

The kerala Story on OTT

The kerala Story: 2023, మే 5న విడుదలైన ది కేరళ స్టోరీ మూవీ అంతటి సంచలనం రేపిందో తెలిసిందే. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో కేరళకు చెందిన 32,000 మంది హిందూ అమ్మాయిలను మోసపూరితంగా కొందరు ఇస్లాం మతంలోకి మార్చి.. ఐసిస్‍లోకి పంపారని ది కేరళ స్టోరీ సినిమా ట్రైలర్‌లో ఉండటంతో తీవ్ర దుమారం రేగింది. కాగా విడుదలైన 9 నెలలకి ఓటీటీలోకి వస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ ఓటీటీ జీ5 వెల్లడించింది.

అదాశర్మ పాత్రలో నటించిన ఈ సినిమా అపట్లో తీవ్ర దుమారం రేపింది. కేరళలో అమాయక యువతులను ఎలా వలలో వేసుకొని, మతం మార్చి ఐసిస్ లాంటి ప్రమాదకర ఉగ్రవాద సంస్థల్లో జాయిన్ చేస్తున్నారో చూపిస్తూ ఈ సినిమా సాగింది. ఈ మూవీ అంతకుముందు ఏడాది ది కశ్మీర్ ఫైల్స్ లాగే తీవ్ర రాజకీయ దుమారానికి కాణమైంది. అప్పటి నుంచీ ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu