HomeTelugu Trending'వాల్మీకి' టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్‌

‘వాల్మీకి’ టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్‌

8 24వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమా టైటిల్‌ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా చిత్రాన్ని రూపొందించారని, సినిమా టైటిల్‌ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని బోయ హక్కుల సమితి పిటిషన్‌ దాఖలు చేసింది. తమ కులస్థులను కించపరిచేలా సినిమా తీసిన చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

హరీశ్‌ శంకర్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంలో.. పూజా హెగ్డే హీరోయిన్‌. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu