HomeTelugu Trending'సరిలేరు నీకెవ్వరు' కనుల పండుగగా ఉందంటూ.. ప్రముఖుల ట్వీట్లు

‘సరిలేరు నీకెవ్వరు’ కనుల పండుగగా ఉందంటూ.. ప్రముఖుల ట్వీట్లు

3 9
టాలీవుడ్‌లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైయ్యాయి. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలతో బాక్సాఫీస్‌ వద్ద సందడి నెలకొంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్‌ ఆర్మీ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమా చూసిన అభిమానులు ‘బొమ్మ దద్దరిల్లిపోయింది’ అని సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు సినీ ప్రముఖులు సైతం చాలారోజుల తర్వాత మహేష్‌ను మాస్‌ సినిమాలో చూడడం కనుల పండుగగా ఉందంటూ ట్వీట్లు పెడుతున్నారు.

”సరిలేరునీకెవ్వరు’ చిత్రంలో మహేష్‌ లుక్‌, నటన చాలా అద్భుతంగా ఉంది. చాలా రోజుల తర్వాత మహేష్‌ను ఇలా చూడడం కనుల విందుగా ఉంది. ఇది ఒక మాస్‌ మసాలా మహేష్‌ మ్యాజిక్‌. అనిల్‌ రావిపూడి బృందానికి కంగ్రాట్స్‌’ – హరీశ్‌ శంకర్‌

‘ఇటీవల విడుదలైన సినిమాల్లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రతి ఫ్రేమ్‌లోనూ మహేష్‌ను చూడడం కనుల పండుగగా ఉంది. సినిమా ఆద్యంతం అనిల్‌ రావిపూడి తన మార్క్‌ను చూపించారు. నా స్నేహితుడు అనిల్‌ సుంకరతోపాటు ఇతర చిత్రబృందానికి అభినందనలు’ – శ్రీనువైట్ల

”సరిలేరునీకెవ్వరు’లో మహేష్‌ స్టైల్‌ సూపర్‌గా ఉంది. ఇంటర్‌వెల్‌ సీన్‌లో విజయశాంతి మేడమ్‌ నటన పవర్‌ఫుల్‌గా అనిపించింది. సూటీగా చెప్పాలంటే బొమ్మ దద్దరిల్లిపోయిందమ్మా..!! బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రబృందానికి కంగ్రాట్స్‌’ – సుధీర్‌బాబు

‘ఇలాంటి హీరో నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫర్ట్‌. మహేష్‌ నీ నటన చాలా బాగుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఆద్యంతం నాకు బాగా నచ్చింది. కంగ్రాట్స్‌ బ్రదర్‌. సంక్రాంతి నీదే.’ – మంజుల ఘట్టమనేని

Recent Articles English

Gallery

Recent Articles Telugu